సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల గరిష్ట వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వయోపరిమితి సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉండనుందని.. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మినహాయింపు ఉండనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు అర్హత లభించే అవకాశం ఉంది.


