మొబైల్‌ వ్యాక్సిన్‌ వ్యాన్‌ ప్రారంభం

GHMC launches mobile vaccination vans - Sakshi

శేరిలింగంపల్లి: జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయంలో మొబైల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వ్యాన్‌ను జాయింట్‌ జోనల్‌ కమిషనర్‌ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన వారు రెండు డోసుల వ్యాక్సి న్‌ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్‌ డోస్‌ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్‌ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్‌ డోస్‌ వేస్తామని వివరించారు.

శేరిలింగంపల్లి, చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని వారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వృద్దులు, సిక్‌ అయిన వారు బూస్టర్‌ డోస్‌ కోసం కంట్రోల్‌ రూం నెంబర్‌ 040–21111111లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌ఓలు డాక్టర్‌ రవి, డాక్టర్‌ కార్తీక్, పీఓ మాన్వి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top