చైనాతో ఇండియాను పోల్చొద్దు.. కరోనాపై భయాలు వద్దు

Gandhi Hospital Superintendent Raja Rao On Covid Surge In China India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లేనని, భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్‌ నోడల్‌ సెంటర్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతు ఇండియాకు చైనాకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.

చైనా అజాగ్రత్తగా వ్యవహించిందని, అక్కడి ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ జరగలేదని, హెర్డ్‌ ఇమ్యూనిటీ రాకపోవడంతో మరోమారు విజృంభిస్తున్నట్లు నిపుణుల పరిశీలన లో తేలిందన్నారు. ఇండియాను చైనాతో పోల్చవద్దన్నారు. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో వ్యా క్సినేషన్‌ వందశాతం పూర్తయిందన్నారు. ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లే వ్యాప్తిలో ఉన్నాయని, కరోనా వైరస్‌ రూపాంతరం చెంది కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

► చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు, దీర్ఘకాల రుగ్మతలతో బాధపడేవారు కోవిడ్‌ తర్వాత వచ్చే బ్లాక్‌ఫంగస్‌ వంటి రుగ్మతల బారిన పడే అవకాశాలున్నాయని, వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

► మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్‌ (డీఎంఈ) రమేష్‌రెడ్డి ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్‌ బాధితుల నుంచి నమూనాలు సేకరించి గాంధీ మెడికల్‌ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.  

► కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తు, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, సామూహిక, ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు.  

► గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఎనిమిది మంది కోవిడ్‌ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. గత కొన్ని నెలలుగా బాధితుల సంఖ్య పదికి మించలేదన్నారు. ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశం లేదని, వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-12-2022
Dec 22, 2022, 12:24 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్‌ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌ ప్రస్తుతం...
22-12-2022
Dec 22, 2022, 12:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న...
22-12-2022
Dec 22, 2022, 01:45 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో...
22-12-2022
Dec 22, 2022, 00:16 IST
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే...
21-12-2022
Dec 21, 2022, 03:36 IST
చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు...
04-11-2022
Nov 04, 2022, 10:36 IST
British man who had COVID for 411 days is cured: దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్‌...
29-07-2022
Jul 29, 2022, 01:19 IST
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్‌ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన...
26-07-2022
Jul 26, 2022, 03:40 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్‌ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి...
15-07-2022
Jul 15, 2022, 04:30 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా...
10-07-2022
Jul 10, 2022, 02:55 IST
సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్‌ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర...
19-06-2022
Jun 19, 2022, 10:25 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  నిత్యం...
14-06-2022
Jun 14, 2022, 10:09 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ కేసులతోపాటు యాక్టివ్‌ కేసులు సంఖ్య...
14-06-2022
Jun 14, 2022, 01:16 IST
సాక్షి, హైదరాబాద్‌: అర్హులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషనరీ డోస్‌ ఇవ్వడానికి అనుమతివ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని...
14-06-2022
Jun 14, 2022, 01:11 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో కరోనా ‘ఫోర్త్‌ వేవ్‌’మొదలైందా? ప్రస్తు తం మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక...
06-06-2022
Jun 06, 2022, 06:11 IST
వానాకాలం రాకుండానే రకరకాల వైరస్‌ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్‌ కేసులు దడపుట్టిస్తున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో...
03-06-2022
Jun 03, 2022, 10:45 IST
నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్‌ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ...
28-05-2022
May 28, 2022, 17:03 IST
కరోనా బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు, తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా ఎముకల క్షయాన్ని గుర్తించారు. కరోనా వైరస్‌ సోకిన
19-05-2022
May 19, 2022, 11:26 IST
North Korea Tells Citizens to Gargle Salt Water to Fight Covid: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు...
12-05-2022
May 12, 2022, 15:33 IST
న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి...
08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...



 

Read also in:
Back to Top