
( ఫైల్ ఫోటో )
సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హారీస్రావు సమావేశమయ్యారు. ఈరోజు(జూన్9వ తేదీ) కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్రావు.. ఆపై నేరుగా కేసీఆర్తో సమావేశం కావడానికి బయల్దేరి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హరీష్ రావు హాజరు అయిన నేపద్యంలో వీరి మధ్య సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్య క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం నడుమే హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు,. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తాను వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు.