సాక్షి, కామారెడ్డి/లింగంపేట: ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో వరి మంచి దిగుబడి వచ్చింది.. రైతు సంబురంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. వారం రోజులైనా తన వంతు రాలేదు. రోజూ రాత్రి చలిలో ధాన్యం కుప్పల వద్దే పడుకున్నాడు. అదే కుప్పపై గుండెపోటుతో కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ మండలంలోని ఐలాపూర్కు చెందిన పాతింటి మామిడి చిన్న బీరయ్య (56) తనకున్న పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమి కలిపి నాలుగున్నర ఎకరాల్లో వరి వేశాడు. వరికోతలు పూర్తికావడంతో గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాడు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వరుస నంబర్లు కేటాయించగా.. బీరయ్యకు 70వ నంబర్ వచ్చింది. ఆ రోజు నుంచి ధాన్యం కోనుగోలు కోసం పడిగాపులు పడుతూ వచ్చాడు.
చలిగా ఉన్నా రోజూ రాత్రి ధాన్యం కుప్పవద్దే నిద్రపోయాడు. రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడవడంతో ఆరబెడుతూ అవస్థలు పడ్డాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి.. తన వడ్ల కుప్పపై పడుకున్నాడు. శుక్రవారం ఉదయం తోటి రైతులు గమనించే సరికి చనిపోయి ఉన్నాడు. అధికారులు బీరయ్య మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. ఇది తెలిసి కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయారు. ధాన్యం కొనుగోలు కాలేదన్న మనోవేదనతోనే బీరయ్య గుండెపోటుతో చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. బీరయ్యకు భార్య పోచవ్వ, కుమారులు రాజేందర్, మహేశ్ ఉన్నారు.
సీఎంవో అధికారుల ఆరా..!
వరికుప్పపై రైతు మృతి చెందిన విషయమై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. బీరయ్య ఎలా చనిపోయాడని జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కాగా.. కొనుగోలు కేంద్రం వద్ద రైతు మరణించిన వార్త దావానలంలా వ్యాపించడంతో.. చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రైతు కుటుంబానికి సానుభూతి తెలిపారు. అయితే మండల, జిల్లా అధికారులెవరూ బీరయ్య చనిపోయిన కొనుగోలు కేంద్రం వద్దకు గానీ, ఆయన ఇంటికిగానీ రాలేదని స్థానికులు మండిపడుతున్నారు.
ధాన్యం రాశిపైనే ఆగిన ఊపిరి
Published Sat, Nov 6 2021 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement