EC Notice Warangal TRS Leader Who Distribute Liquor And Chicken - Sakshi
Sakshi News home page

కోడి, క్వార్టర్‌ పంచిన టీఆర్‌ఎస్‌ నేతకు షాక్‌

Oct 13 2022 1:41 PM | Updated on Oct 13 2022 3:09 PM

EC Notices Warangal TRS Leader Who Distribute Liquor Chicken - Sakshi

లిక్కర్‌, కోడి పంపిణీ చేసిన నాటి దృశ్యం

కేసీఆర్‌ కుటుంబంపై వీరాభిమానంతోనే కోడి, క్వార్టర్‌ బాటిల్‌ పంచిన ఆ టీఆర్‌ఎస్‌ నేతకు.. 

సాక్షి, వరంగల్: కేసీఆర్‌ కుటుంబంపై వీరాభిమానంతో అనే ప్రచారంతో కోడి, క్వార్డర్‌ బాటిల్‌ను హమాలీలకు పంచిన టీఆర్‌ఎస్‌ నేతకు షాక్‌ తగిలింది. ఎన్నికల కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

దసరా సందర్భంగా టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను టీఆర్‌ఎస్‌ నేత రాజనాల శ్రీహరి ఉచితంగా పంపిణీ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ క్రమంలో.. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి అక్కడి ప్రజలకు మద్యం, కోడి పంపిణీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ అనే నేత. దీంతో ఈ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్‌ జారీ చేసింది.

అయితే.. మునుగోడు ఓటర్లకు లిక్కర్, కోడి పంపిణీ చేశారన్న ఆరోపణలపై శ్రీహరి స్పందించారు. అసలు మునుగోడు ఉప ఎన్నికకు.. మద్యం కోడి పంపిణీకి సంబంధం లేదని చెప్తున్నారాయన. రాజకీయ దుర్బుద్ధితో కొందరు కావాలని ఎన్నికల కమిషన్ కు  తప్పుడు సమాచారం అందించారని, ఆపై తనకు నోటీసులు అందాయని అంటున్నారాయన. సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని.. అదీ వరంగల్‌లోనే దసరా రోజున మద్యం బాటిల్, కోడిని పంపిణీ చేశానని వివరణ ఇచ్చే యత్నం చేశారు రాజనాల శ్రీహరి.

ఇదీ చదవండి: ఇది బెంగళూరు కాదు సార్‌.. హైదరాబాదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement