
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ జితేందర్ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్ పేట్ ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసీపీగా ఏ యాదగిరి, ఎస్ఆర్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ సుధాకర్, కూకట్పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ నగర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసీపీగా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసీపీగా పి ప్రవీణ్ కుమార్లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.