ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ కార్యవర్గం  | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ కార్యవర్గం 

Published Fri, Feb 24 2023 3:28 AM

Damodar Reddy Elected As TSGREA President - Sakshi

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షునిగా దామోదర్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్‌లో రెండ్రోజులు జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు గురువారం ముగిశాయి. అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షునిగా విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి.మోహన్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్‌ మోహన్, శ్రీహరిరెడ్డి, సీతారామయ్య, భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా టి.ప్రభాకర్, పి.శ్యామ్‌రావు, ఎన్‌.విష్ణువర్ధన్‌రెడ్డి, పి.శరత్‌బాబు, విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బక్కారెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కోశాధికారిగా గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చందులాల్, శ్రీవాస్తవ్, రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పెంటయ్య తదితరులను ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు.

Advertisement
Advertisement