సీపీఐ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ | CPI Telangana state conference logo unveiled | Sakshi
Sakshi News home page

సీపీఐ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ

Jul 14 2025 5:55 AM | Updated on Jul 14 2025 5:55 AM

CPI Telangana state conference logo unveiled

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం హిమాయత్‌నగర్‌లోని రాజ్‌ బహదూర్‌ హాల్‌లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సీపీఐ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరిస్తూ, చందాలను సేకరించాలన్నారు.

సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహ, కలవేణి శంకర్, శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్‌ పావని, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఈ. ఉమామహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement