సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్‌ శంకుస్థాపన | Cm Revanth Laid Foundation Stone For Many Development Works In Kondareddypalli | Sakshi
Sakshi News home page

సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్‌ శంకుస్థాపన

Oct 12 2024 3:43 PM | Updated on Oct 12 2024 4:20 PM

Cm Revanth Laid Foundation Stone For Many Development Works In Kondareddypalli

సాక్షి నాగర్‌ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, మిల్క్‌ బల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.

కాగా, సీఎం రేవంత్‌రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్‌ లైట్లను అమర్చారు.

సొంతూరులో సీఎం రేవంత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 

Advertisement
 
Advertisement
Advertisement