చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ | Central Minister Kishan Reddy Meet Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

Nov 3 2024 5:45 AM | Updated on Nov 3 2024 5:45 AM

Central Minister Kishan Reddy Meet Chiranjeevi

సాక్షి, హైదరాబాద్‌: సినీహీరో చిరంజీవితో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన్ను కిషన్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. దీపావళి సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ‘ఎక్స్‌’ ద్వారా కిషన్‌రెడ్డి వెల్లడించారు.

సినీపరిశ్రమతో పాటు సేవా కార్యక్రమాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రభావితం చేసిన చిరంజీవిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కిషన్‌రెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా నియమితుడైన బీఆర్‌ నాయుడిని కూడా కిషన్‌రెడ్డి కలిసి అభినందించినట్లు పార్టీ నాయకుల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement