నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి 9వ తేదీ) తెల్లవారజామాను మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ట్యాంకర్, డీసీఎం ఢీకొని స్పాట్లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


