Two Students Died In Road Accident At Hyderabad - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Jul 1 2023 1:38 PM | Updated on Jul 1 2023 1:45 PM

Two Students Died In Road Accident At Hyderabad - Sakshi

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన శుక్రవారం మేడిపల్లి పొలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్‌లోని జాహ్నవి డిగ్రీ కాలేజీ కి చెందిన విద్యార్థులు భూమ సాయి కుమార్‌ (22) అనిత (20) స్నేహితులతో కలిసి శుక్రవారం సంఘీటెంపుల్‌కు వెళ్లారు.

బైక్‌పై బోడుప్పల్‌కు తిరిగి వస్తుండగా ప్రతాప్‌ సింగారం పరిధిలోని డబల్‌ బెడ్‌ రూం ఇళ్ల సమీపంలో  ఆర్‌టీసీ బస్సు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన వారు   అక్కడికి అక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement