తమిళనాడులో తొలి ఆంత్రోపిక్‌ క్లౌడ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ | - | Sakshi
Sakshi News home page

తమిళనాడులో తొలి ఆంత్రోపిక్‌ క్లౌడ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

● ప్రారంభించిన ఇస్రో మాజీ ఛైర్మెన్‌ డాక్టర్‌ మైల్‌స్వామి అన్నాదురై

సాక్షి,చైన్నె: జీడబ్ల్యూసీ డేటా ఏఐ ఆధ్వర్యంలో తమిళనాడులో తొలిసారిగా ఆంత్రోపిక్‌ క్లౌడ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. హోసూరులోని జి డబ్ల్యూ సి డేటా ఏఐ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్‌ను మాజీ ఇస్రో ఛైర్మెన్‌ , తమిళనాడు ప్రభుత్వ స్కూల్‌ కరికుళం డిజైన్‌ కమిటీ ఛైర్మెన్‌ డాక్టర్‌ మైల్‌ స్వామి అన్నాదురై , ఆంత్రోఫిక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇరినా ఘోష్‌ ల చేతులమీదుగా ఘనంగా ప్రారంభించారు . రాష్ట్రంలో ఈ తరహా ప్రత్యేక కేంద్రం ఇదే మొట్టమొదటి కావటం విశేషం. క్లాడ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌, ఆంత్రోపిక్‌ క్లాడ్‌ నమూనాల ఆధారంగా, సేవా ఆటోమేషన్‌, ఇంటెలిజెన్స్‌ , వర్క్‌ఫ్లో ఆధునీకరణ వంటి రంగాలలో ఏజెంటిక్‌ ఏఐ పరిష్కారాలను ప్రోటో టైప్‌ చేయడానికి, నిర్మించడానికి, అమలు చేయడానికి సంస్థలకు , ప్రభుత్వ విభాగాలకు ఒక పని వాతావరణాన్ని అందిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ల్యాబ్‌, ఆంత్రోపిక్‌ క్లాడ్‌ను ఒక సాధనంగా ఉపయోగించి, సాధికారతను, సహ–ఆవిష్కరణను ఒకే సదుపాయంలోకి తీసుకువస్తుందని ,వివిధ రంగాలలోని వినియోగదారులకు క్లాడ్‌ను ఉపయోగించి పరిష్కారాలను అందిస్తాయని జీడబ్ల్యూసీ డేటా ఏఐ వ్యవస్థాపక సీఈవో నవీన్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement