క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 20 2025 5:31 AM | Updated on Aug 20 2025 5:31 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

రవాణా కార్మికుల నిరసన

– 200 మంది అరెస్టు

కొరుక్కుపేట: చైన్నె ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌, తమిళనాడు రిటైర్డ్‌ పేరెంట్స్‌ రిటైర్మెంట్‌ హోమ్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన 3,500 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు గత 7 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. గత 12 నెలల బకాయిలు, 2003 తర్వాత ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు పెన్షన్‌ పథకం, పదవీ విరమణ చేసిన వారికి తక్షణ వైద్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఐడీ ట్రేడ్‌ యూనియన్‌ సభ్యులు చింతాద్రి పేట పల్లవన్‌ ఇల్లం లో నిరసన తెలిపారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని, నిరసనలో పాల్గొనకూడదని చెబుతూ పోలీ సులు వారిని అరెస్టు చేశారు. మూడు ప్రదేశాల్లో 200 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్మికులు మాట్లాడుతూ చట్టబద్ధమైన డిమాండ్ల కోసం ఒత్తిడి తీసుకురావడానికే తాము నిరసన తెలిపేందుకు వచ్చామని, అయితే పోలీసులు తమపై అణచివేత విధానాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

రోడ్డుకు మరమ్మతులు

చే యాలని ఆందోళన

కొరుక్కుపేట: చైన్నెలోని వ్యాసార్పాడి రోడ్డులోని నెహ్రూ నగర్‌ ప్రాంతంలోని 46వ వార్డులో రోడ్డు వేయడానికి పాత రోడ్డును అధికారులు తవ్వారు. అయితే తర్వాత దాన్ని పట్టించుకోలేదు. దీంతో వర్షాల వల్ల రోడ్డు దెబ్బతింది. దీనిపై ప్రజలు అనేకసార్లు అధికారులను సంప్రదించారు. అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, మంగళవారం ఉదయం వ్యాసర్పాడి సత్యమూర్తి నగర్‌ ప్రధాన రహదారిపై 50 మందికి పైగా ప్రజలు ఒక్కసారిగా రోడ్డును దిగ్భందించారు. సమా చారం అందుకున్న వ్యాసార్పాడి సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ కుమార్‌, మెట్రో వాటర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సూర్య ప్రకాష్‌, కార్పొరేషన్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. రోడ్డు మరమ్మతులు చేస్తా మని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు వెళ్లిపోయారు.

విద్యార్థులకు ప్రత్యేక బస్సులు

కొరుక్కుపేట: చైన్నెలో 25 పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ప్రారంభించారు. తమిళనాడు అంతటా విద్యార్థులు తమ నివాస స్థలాల నుంచి విద్యా సంస్థలకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి దీనిని ప్రారంభించారు. ఈ పథకాన్ని రాష్ట్రం అంతటా 34,12,147 మంది విద్యార్థులకు, చైన్నెలో 4లక్షల30 వేలమంది విద్యార్థులకు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంలో చైన్నెలోని ట్రిప్లికెన్‌లోని లేడీ వెల్లింగ్టన్‌ కళాశాల ప్రాంగణంలో బస్‌ ట్రావెల్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొని విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ కార్డులను పంపిణీ చేశారు. రవాణా, విద్యుత్‌ శాఖమంత్రి ఎస్‌సీ శివశంకర్‌ పాల్గొన్నారు.

యువతికి లైంగిక వేధింపులు

తిరువొత్తియూరు: చైన్నె, మడిపాక్కంలో డ్రైవింగ్‌ శిక్షణ ఇస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు గురిచేసిన డ్రైవింగ్‌ స్కూల్‌ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె మడిపాక్కం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్‌ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడానికి మడిపాక్కం రామ్‌నగర్‌లో నడుస్తున్న డ్రైవింగ్‌ స్కూల్‌లో చేరారు. మంగళవారం పని ముగించుకుని తన తండ్రితో కలిసి డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లారు. ద్విచక్ర వాహనం నడపడంలో శిక్షణ ఇస్తానని చెప్పి, దాని యజమాని మడిపాక్కం రామ్‌నగర్‌కు చెందిన గోపాలకృష్ణన్‌ (60), ఆమెను వేళచ్చేరి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రహదారికి తీసుకెళ్లాడు. అక్కడ శిక్షణ ఇస్తున్నట్లుగా నటిస్తూ ఆమెకు లైంగిక వేధింపులు ఇచ్చాడు. వెంటనే ఆ యువతి ద్విచక్ర వాహనం దిగి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించింది. దీంతో గోపాలకృష్ణన్‌ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళను రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మడిపాక్కం మహిళా పోలీసులు గోపాలకృష్ణన్‌పై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ సమయంలో గోపాలకృష్ణన్‌ శిక్షణ పేరుతో లైంగిక వేధింపులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గోపాలకృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సహాయకాల పంపిణీ

పళ్లిపట్టు: అన్నాడీఎంకే శశికళ వర్గీయులు ఆర్కేపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పేదలకు సహాయకాలు, బిర్యానీ పంపిణీ చేశారు. శశికళ పుట్టిన సందర్భంగా ఆర్కేపేట బీడీఓ కార్యాలయం సమీపంలో మంగళవారం అన్నాడీఎంకే శశికళ వర్గీయులు సహాయకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నరసింహన్‌ హాజరై ఎంజీఆర్‌, జయలలిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు, లుంగీలు అందజేశారు. అందరికీ బిర్యానీ పంపిణీ చేశారు. నేతలు రజిని, నటరాజన్‌. చంద్రన్‌, రాజానగరం శేఖర్‌, కుమారస్వామి, వంగనూరు కందప్పన్‌, హరిరాజు, పారి, గిరిరాజు, ఆనందన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement