
నేత్ర పరీక్ష, పరిశోధనలకు తోడ్పాటు
సాక్షి, చైన్నె: నేత్ర పరీక్ష, పరిశోధనలకు తోడ్పాటు అందించే విధంగా ఐరీసెర్చ్ సెంటర్కు జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరిధిలోని జెమ్ హాలిడే రిసార్ట్స్ విరాళం ప్రకటించింది. పేదలకు వైద్య చికిత్సలు, శస్త్ర చికిత్స సేవలకు రూ. 12,48,236ను విరాళంగా బుధవారం అందజేసింది. కంటి పరిశోధన కేంద్రంకు వచ్చే పేద రోగుల కంటి సంరక్షణకు గాను ఈ మొత్తాన్ని అందజేశారు. నేత్ర పరిశోధన కేంద్రం అధ్యక్షురాలు డాక్టర్ అతియా అగర్వాల్ మాట్లాడుతూ, శ్ఙ్రీనేత్ర పరిశోధన కేంద్రంలోలక్ష్యం దృష్టిని పునరుద్ధరించడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడం అని పేర్కొన్నారు.ఈ సహకార భాగస్వామ్యం ప్రారంభం మాత్రమే అంటూ, వెనుకబడిన వర్గాల ప్రజలకు కంటి చూపును పునరుద్ధరించడంలో సహాయపడటానికి ఈ నిధిని ఖర్చు పెడుతామన్నారు. జెమ్ ఎండీ ఎస్ఆర్ ఆశై తంబి మాట్లాడుతూ, సామాజిక బాధ్యత గా కంటి పరిశోధన కేంద్రంకు సహకారం అందించామన్నారు. అధునాతన కంటి సంరక్షణ , పరిశోధన ద్వారా జీవితాలను మార్చే తమ వంతు తోడ్పాటు ఉంటుందన్నారు. స్క్రీనింగ్ శిబిరాలు, కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం , సంక్లిష్ట విధానాలను ఉచితంగా నిర్వహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా ఈ కేంద్రం సమాజ హిత కార్యక్రమాలకు కట్టుబడి ఉండటంతో సహకారం అందించామన్నారు.