విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం ఎగ్జిబిషన్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం ఎగ్జిబిషన్‌

Nov 7 2023 1:08 AM | Updated on Nov 7 2023 1:08 AM

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటీమణులు సుకన్య, నీలిమా తదితరులు 
 - Sakshi

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటీమణులు సుకన్య, నీలిమా తదితరులు

సాక్షి, చైన్నె: రాజస్తానీ అసోసియేషన్‌ నేతృత్వంలో రాజస్థానీ బజార్‌ పేరిట సంస్కృతి, ఐక్యను చాటే విధంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సెయింట్‌ జార్జ్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ సినీ నటి , కలైమామణి సుకన్య రమేష్‌, నటి నీలిమా రాణి, రిఫెక్స్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ జగదీశ్‌ ప్రారంభించారు. ఇక్కడ 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విభిన్న కళాత్మకాలను కొలువు దీర్చారు. ఈ వేడుక ద్వారా వచ్చే మొత్తంలో రూ. 50 లక్షలను విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లకు ఉపయోగిస్తున్నామని సోమవారం జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్‌ ఎక్స్‌ పో చైర్మన్‌ నరేంద్ర శ్రీమల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నిర్వాహకులు దిలీప్‌ చందన్‌, మోహన్‌ లాల్‌ బజాజ్‌, ప్రవీణ్‌ తాటియా, హేమంత్‌ దుగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement