భానుపురి (సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించి వాల్ పోస్టర్ను బుధవారం కలెక్టర్ చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు, కృత్రిమ రంగుల వినియోగంతో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఏఈఎస్ పురుషోత్తంరెడ్డి, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


