హుజూర్నగర్ : ఉద్యోగుల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని టీజేఏసీ జిల్లా చైర్మన్ దున్న శ్యామ్, కో–చైర్మన్ అంజయ్య అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం హుజూర్నగర్లో తహసీల్దార్ కవిత, ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీఓ రమేష్, డీటీలు శ్రీనివాస్, నాగేందర్, డీవైఎస్ఓ అశోక్ బాబు, ఆర్ఐలు శ్రీనివాస్, షరీఫ్, సిబ్బంది, టీఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు.


