మట్టపల్లి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Sep 6 2026 2:25 AM | Updated on Sep 6 2026 2:25 AM

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు, మధ్యాహ్నం 12గంటలకు తీర్థప్రసాదాలు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణుడికి పొన్నవాహన సేవతోపాటు పెదవీడుకు చెందిన యాదవుల ఆధ్వర్యంలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మహా నివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement