
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూ వరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, రుత్విగ్వరణం , పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కాగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, కంబాల మురళినాయుడు పాల్గొన్నారు.