శ్రీకాకుళం పాత బస్టాండ్: రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే భారీ వర్షాలు, తీవ్ర ఈదురుగాలుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విపత్తు నిర్వహణ చర్యలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు. నియమితులైన అధికారులు సంబంధిత మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మండలాల ప్రత్యేకాధికారులు
రణస్థలం పి.సుగుణాకరరావు, ఎస్ఈ సుడా 7901402999
ఎచ్చెర్ల కె.రాజగోపాలరావు, జేడీ పశుసంవర్దక శాఖ 9989932798
శ్రీకాకుళం బి.లవరాజు, పీడీ డ్వామా 8790008399
గార ఆర్.స్వరూపారాణి, డీపీఓ 8341493877
పోలాకి ఆర్.వెంకటరామన్, జెడ్పీ సీఈఓ 9100997770
సంతబొమ్మాళి పి.కిరణ్ కుమార్, పీడీ డీఆర్డీఏ 8008803800
వజ్రపుకొత్తూరు టి.సుమలత, జేడీ, ఫిషరీష్ 9885863475
సోంపేట కాళ్ల అజయ్కార్తికేయ, ఏసీ, కార్మికశాఖ 9492555034
మందస పి.చంద్రశేఖర్, ఏడీ, పలాస 9492416700
కవిటి చంద్రశేఖర్, ఏడీ హర్టీకల్చర్ 7995086760
కంచిలి పి.వేణుగోపాలరావు, ఏపీసీ సమగ్రశిక్ష 8500525525


