అధికారుల తీరు సక్రమంగా లేదంటూ జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య మండిపడ్డారు. బుధవారం పోలాకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముద్దాడ దమయంతి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ నిధులు ఖర్చుచేసేందుకు పంచాయతీల తీర్మానం ఇవ్వకపోవటంపై కృష్ణచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను రాజకీయ ఉద్దేశాలతో అడ్డుకోవడానికి అధికారులు సహకరించడం సరికాదన్నారు. అనంతరం సమావేశం నుంచి బయటకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. – పోలాకి


