● తవ్వేస్తూ.. తరలిస్తూ..
నరసన్నపేట నియోజకవర్గంలో ఇసుకాసురలు చెలరేగిపోతున్నారు. అటు కరకవలస నుంచి ఇటు వనితమండలం వరకూ వంశధార నదిలో ఇష్టారాజ్యంగా అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి తవ్వకాలు సాగిస్తున్నారు.గోపాలపెంట, మడపాం, బుచ్చిపేట, చేనువలస, ఉప్పరిపేట, లుకలాం, వెంకటాపురం, పర్లాం, కొమనాపల్లి, దొంపాక, అందవరం ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలాచోట్ల అనుమతులు లేకుండా నదీ గర్భంలో పరిమితికి మించి జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. విశాఖ వంటి దూర ప్రాంతాలకు నిత్యం ట్రిప్పర్ ద్వారా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పర్యావరణానికి తూట్లుపొడుస్తున్నారు. – నరసన్నపేట


