రూ.
అరసవల్లి ఆదిత్యుడి ఆదాయం 1,35,14,879
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు బుధవారంతో పూర్తయ్యింది. రెండు రోజులుగా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు జరుగుతుండగా బుధవారం మొత్తం నగదు, చిల్లర కలుపుకుని రూ.33,49,379 ఆదాయం లభించింది. మంగళవారం లెక్కింపులో లభించిన ఆదాయం కలిపితే మొత్తం రూ.1,35,14,879 ఆదాయం లభించిందని ఈఓ వివరించారు. అనివెట్టి మండపంలో జరిగిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పలు ఆలయాల ఈవోలు జి.గురునాథరావు, మునగవలస సుకన్య తదితరులు పాల్గొన్నారు.


