● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత

● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత

హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం స్కాట్‌పేట వద్ద మంగళవారం ఓ అనూహ్య ఘటన జరిగింది. ఓ మిల్లుకు ధాన్యం లోడుతో వచ్చిన లారీ రోడ్డు పక్కనే నిలబెట్టి ఉంది. ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ డీఎం టీ.వేణుగోపాలరావు అటువైపుగా వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన లారీని పరిశీలించారు. ఎక్కడకు తీసుకొచ్చారని డ్రైవర్‌ను అడగ్గా స్థానిక రైస్‌మిల్లుకు తీసుకొచ్చినట్టు తెలిపాడు. కానీ అందుకు తగ్గ పత్రాలేవీ లేవు. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ లారీ లోడు ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, వీఆర్వో రమణమ్మలకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. లారీలో రూ.7 లక్షల విలువైన ధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement