మాతా శిశు మరణాలు తగ్గాలి | - | Sakshi
Sakshi News home page

మాతా శిశు మరణాలు తగ్గాలి

May 17 2025 7:05 AM | Updated on May 17 2025 7:05 AM

మాతా శిశు మరణాలు తగ్గాలి

మాతా శిశు మరణాలు తగ్గాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో మాతా శిశు మరణాల రేటు తగ్గాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో జరిగిన 12 శిశు మరణాలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డీఎంహెచ్‌ఓ కె.అనిత, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి రాందాస్‌, డీపీహెచ్‌ఎన్‌ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement