30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి

Apr 29 2025 9:45 AM | Updated on Apr 29 2025 9:53 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో ఫ్యాక్టరీల చట్టం, 1948 ప్రకారం రిజిస్టరైన రైస్‌ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, గ్రానైట్‌ కర్మాగారాలు, స్టోన్‌ క్రషర్‌లు, షా మిల్లులు (కర్రల మిల్లులు), ఇతర పెద్ద కర్మాగారాలన్ని ఇంటిగ్రేటెడ్‌ మాన్యువల్‌ రిటర్న్‌లను సమర్పించాలని కర్మాగారాల ఉపముఖ్య తనిఖీ అధికారి రాంబాబు కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 30వ తేదీలోగా సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ఏపీ ఇండస్ట్రీస్‌.జీఓవి.ఇన్‌లో తప్పనిసరిగా సమర్పించాలని కోరారు.

పాలిసెట్‌కు ముమ్మర ఏర్పాట్లు

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్‌–2025 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఆర్‌జేడీ జె.సత్యనారాయణ మూర్తి తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పరీక్ష నిర్వహణపై అధికారులు, ఎగ్జామినర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తు చేసి హాల్‌ టిక్కెట్లు రాని విద్యార్థులు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. పరీక్ష 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షకు నిమిషం అలస్యమైనా అనుమతింబోచమని చెప్పారు. ఆధార్‌ జిరాక్స్‌, రెండు పా స్‌ పోర్టు సైజ్‌ ఫొటోలతో విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని అన్నారు. శ్రీకాకళం, టెక్కలి డివిజన్‌లలోని 39 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి 1152 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. షెడ్యూల్‌ మేరకు పరీక్ష నిర్వహణ, ఫలితాలు వెల్లడి, కౌన్సెలింగ్‌ నిర్వహణ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్‌, జిల్లా ప్రవేశాల ఇన్‌చార్జి బి.జానకి రామయ్య, అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి నీలమణి దుర్గమ్మ మహోత్సవాలు

పాతపట్నం: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాతపట్నం నీలమణి దుర్గమ్మ ఆలయ సన్నిధిలో మంగళవారం నుంచి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజు ల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి టి.వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆలయాన్ని విద్యుత్‌కాంతులతో అలంకరించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆలయంలో హోమాలు, వర్ధినీ కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

రాలిన మామిడి కాయలు

నరసన్నపేట: మండల పరిధిలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రైతులు ఆందోళన చెందారు. పొలాల్లో నువ్వు, పెసర పంటలు ఉన్నాయి. పెసరకు ఇబ్బంది లేకపోయినా నువ్వు పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. అలాగే గాలులకు మామిడి కాయలు పలు చోట్ల రాలాయి. వీఎన్‌ పురం, యారబాడు, ఉర్లాం, బడ్డవానిపేట చిక్కాలవలస, తెలగవలస, కరగాం తదితర గ్రామాల్లో వరి ధాన్యం వర్షానికి కొంత నష్టం కలుగుతుందని రైతులు అంటున్నారు. అరటి చెట్లకు కొంత వరకూ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. నరసన్నపేటలో ఫ్లెక్సీలు గాలికి ఎగిరి పడ్డాయి. మెయిన్‌ రోడ్డుపై కాంప్లెక్స్‌ సమీపంలో ఒక ఫ్లెక్సీ గాలికి విద్యుత్‌ వైర్లపై పడింది. వెంటనే విద్యుత్‌ అధికారులు అప్రమత్తమై తొలగించారు.

30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి 1
1/2

30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి

30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి 2
2/2

30లోగా రిటర్న్‌లు దాఖలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement