
మురుగు పారదు.. దుర్గంధం వదలదు
మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ పరిధిలోని హీరాపురం గ్రామంలోని కాలువలు మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. కాలువలు నిండి మురుగునీరు పారకపోవడంతో దుర్గంధం వెదజల్ల్లుతూ అక్కడి ప్రజలు అవస్థ లు పడుతున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన ప డే అవకాశాలు ఉన్నాయని, మురుగునీటి సమ స్య ఉత్పన్నం కాకుండా పంచాయతీ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: ఇంట్లో కరెంట్ లేదని, దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్ వచ్చి పోతుండటంతో స్విచ్ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రో దించారు. మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.
ఆటో..బైక్ ఢీ: విద్యార్థికి గాయాలు
మెళియాపుట్టి: ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో మండలంలోని పెద్దమడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పడాల విజయ్ అనే విద్యార్థి గాయాల పాలయ్యాడు. మండలంలోని కొత్తూరు గ్రా మానికి చెందిన విజయ్ ఆదివారం తన మామయ్య శ్రీనుతో కలిసి బైక్పై మెళియాపుట్టి నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. మెళియాపుట్టి గ్రామ శివార్లలో వస్తున్న ఆటోని బైక్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న విజయ్ దూరంగా ఎగిరిపడ్డాడు. దీంతో అతడి కాలికి గా యమైంది. వాహనం నడుపుతున్న శ్రీనుకు సైతం గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇద్దరినీ టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం తరలించినట్టు తెలిపారు.
ఆశాజనకంగా
చోడి పంట
నరసన్నపేట: మండలంలో చోడి పంట ఆశాజనకంగా ఉంది. మెట్ట భూములతో పాటు సాగునీటి వసతులు ఉన్న పొలాల్లో రైతులు చోడిని వేశారు. రావులవలస, బొరిగివలస, బుచ్చిపేట, మడపాం, నడగాం, జమ్ము, తామరాపల్లితో పాటు గ్రామాల్లో రైతులు చోడిని వేశారు. మండలంలో 90 ఎకరాల్లో చోడి పంట ఉన్నట్లు వ్యవసాయ అదికారులు లెక్కలు తెలుపుతున్నాయి. గతంలో పోల్చితే చోడి పిండి వినియోగం ఆరోగ్య రీత్యా పెరగడంతో రైతులకు ఆదాయం వస్తుంది.
కోడి పందాలు ఆడిన
ఐదుగురిపై కేసు నమోదు
సంతబొమ్మాళి: మండలంలోని మర్రిపాడు సమీపంలో కోడి పందేలు నిర్వహించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు నౌపడ ఎస్ఐ నారాయణస్వామి ఆదివారం తెలిపారు. కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పకడ్బందీగా పోలీసులు వెళ్లి రూ.3210 నగదు, నాలుగు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు

మురుగు పారదు.. దుర్గంధం వదలదు