వైద్యుల సంక్రాంతి ఆటవిడుపు | - | Sakshi
Sakshi News home page

వైద్యుల సంక్రాంతి ఆటవిడుపు

Jan 17 2026 7:21 AM | Updated on Jan 17 2026 7:21 AM

వైద్యుల సంక్రాంతి ఆటవిడుపు

వైద్యుల సంక్రాంతి ఆటవిడుపు

బత్తలపల్లి: అనంతపురం, బత్తలపల్లి వైద్యుల మధ్య సంక్రాంతి ఆటవిడుపుగా గురువారం నిర్వహించిన క్రికెట్‌ పోటీ ఉత్సాహంగా సాగింది. బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ పోటీల్లో బత్తలపల్లి వైద్యుల జట్టులో ఎస్పీ సతీష్‌కుమార్‌, ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌, సీఐలు నాగేంద్ర ప్రసాద్‌, ప్రభాకర్‌గౌడు ఆడారు. టాస్‌ గెలిచిన బత్తలపల్లి డాక్టర్ల జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. జట్టులో ఇర్ఫాన్‌ 90 పరుగులు, ఎస్పీ సతీష్‌కుమార్‌ 31 పరుగులు, ధర్మవరం టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ 30 పరుగులు, రూరల్‌ సీఐ ప్రభాకర్‌గౌడ్‌ 14 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ బరిలో దిగిన అనంతపురం డాక్టర్ల జట్టు 24 ఓవర్లలో 185 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. 28 పరుగులతో బత్తలపల్లి డాక్టర్ల జట్టు విజయం సాధించింది. ఎస్పీ సతీష్‌కుమార్‌ 3 వికెట్లు సాధించారు. బ్యాటింగ్‌లో రాణించిన ఇర్ఫాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ఎస్పీ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement