ఫెడరేషన్ కప్పు సాధిస్తాం
కదిరి అర్బన్: ఆల్ ఇండియా గోల్షాట్ బాల్ ఫెడరేషన్ కప్పును సాధించి తీరుతామంటున్న ఏపీ క్రీడాకారులు. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులోని తిరుచునాపల్లిలో ఆల్ ఇండియా 3వ ఫెడరేషన్ కప్ సీనియర్ పురుషులు, మహిళల టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో జిల్లా గోల్ షాట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లిలో ఉన్న హరీష్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో ఏపీ జట్టు క్రీడాకారులు ముమ్మర సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ నెల 25 నుంచి తమిళనాడులో గోల్షాట్బాల్ ఫెడరేషన్ కప్ టోర్నీ
కదిరిలో ముమ్మర సాధన చేస్తున్న ఏపీ జట్టు క్రీడాకారులు
ఫెడరేషన్ కప్పు సాధిస్తాం


