పోలీసుల తీరుపై ప్రైవేట్ కేసులేస్తాం
చట్టాన్ని ఖాకీలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా చేయడం నేరమే అవుతుంది. పౌరహక్కులను కాలరాయొద్దని సుప్రీంకోర్టు ఓ వైపు ఆదేశాలిస్తోంది. అయితే ఖాకీలు మాత్రం అధికార పార్టీ నేతల మెప్పు కోసం థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలంలో నివాసాన్ని కూలదోసిన ఘటనలో ప్రైవేట్ కేసుతో పాటు డ్యామేజ్, ప్రాసిక్యూషన్ కోసం పిటిషన్ను వేస్తాం.
– ఉమామహేశ్వర్రెడ్డి,
సీనియర్ న్యాయవాది, నెల్లూరు
●


