
స్టేట్ పబ్లిసిటీ వింగ్లో జిల్లా నేతల నియామకం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో వివిధ హోదాల్లో నియమించారు. అందులో భాగంగా స్టేట్ పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా చేజర్ల సుబ్బారెడ్డి, జనరల్ సెక్రటరీగా వంగాల శ్రీనివాసులురెడ్డి, సెక్రటరీలుగా కరేటి దైవాదీనం, బొర్రా సుబ్బిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా చెరుకూరి బ్రహ్మయ్య, అశోక్రెడ్డిలను నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం పర్యటన
ఏర్పాట్ల పరిశీలన
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో మే 1న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఆర్డీఓ బి.పావని, మున్సిపల్ కమిషనర్ సి గంగాప్రసాద్, చైర్పర్సన్ వెంకటరమణమ్మతో కలిసి బైపాస్ రోడ్డులోని హెలిప్యాడ్ ప్రాంతం, బీసీ బాలికల గురుకుల పాఠశాల, ఎంఎస్ఎంఈ పార్కుల వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు వద్ద రోడ్లు, విద్యుత్ సరఫరా, తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ఆయన వెంట అన్ని శాఖల అధికారులు, స్థానిక పార్టీ నాయకులు, ఎంపీపీ వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.