
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 144 బంతుల్లో తన సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్తో కలిసి మొదటి వికెట్కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యశస్వి.. ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశాడు . జైశ్వాల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. తన సెంచరీ మార్క్ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఐదో ఆటగాడిగా.
కాగా జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లండ్పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే
133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952
131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996
129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982
146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014
100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025
టీబ్రేక్కు భారత స్కోరంతంటే?
ఇక తొలి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(100), గిల్(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు.
చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
𝙔𝙚𝙝 𝙨𝙞𝙠𝙝𝙖𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣! 🔥
A young star rises in England with a knock full of class. @ybj_19's first century on English soil shines bright. 🤩
Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/SizxLx76AB— Star Sports (@StarSportsIndia) June 20, 2025