
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్లోనే కోహ్లి సెంచరీ సాధించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో కింగ్ కోహ్లి సెంచరీ చెలరేగాడు. ఈ మ్యాచ్లో విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45వ అంతర్జాతీయ వన్డే సెంచరీ అందుకున్నాడు. ఇక ఓవరాల్గా విరాట్కు ఇది 73వ అంతర్జాతీయ సెంచరీ.
ఇక ఈ మ్యాచ్లో 87 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు,ఒక సిక్స్ ఉన్నాయి. కాగా విరాట్కు ఇది వరుసగా రెండో వన్డే శతకం కావడం గమానార్హం. గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో విరాట్ అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం విరాట్కు ఇదే తొలి వన్డే.
Back to back ODI hundreds for @imVkohli 👏👏
— BCCI (@BCCI) January 10, 2023
Live - https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/Crmm45NLNq