పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం | Vaibhav Suryavanshi punishes Pakistan | Sakshi
Sakshi News home page

IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం

Nov 16 2025 9:41 PM | Updated on Nov 16 2025 9:41 PM

Vaibhav Suryavanshi punishes Pakistan

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య వంశీ అద‌ర‌గొడుతున్నాడు. యూఏఈతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన వైభ‌వ్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.

ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్‌, క్రీజులో సెటిల్‌ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు నమన్‌ ధీర్‌(20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు. వీరిద్దరి మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.

10 ఓవర్లలో భారత్ స్కోర్ 93-3 ఉండగా 43 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్‌ బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాజ్ సదఖత్, షాహిద్ అజీజ్ తలా రెండు వికెట్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement