ఫైనల్లో ఆసీస్‌పై విజయం.. మూడోసారి విజేతగా నిలిచిన భారత్‌  | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఆసీస్‌పై విజయం.. మూడోసారి విజేతగా నిలిచిన భారత్‌ 

Published Sun, Oct 30 2022 12:11 PM

Sultan Of Johor Cup Hockey: India Beat Australia In Nail Biting Penalty Shootout In Final - Sakshi

కౌలాలంపూర్‌: సుల్తాన్‌ ఆఫ్‌ జొహోర్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నీలో భారత జట్టు మూడో సారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌ ‘షూటౌట్‌’లో 5–4తో ఆ్రస్టేలియాపై నెగ్గి 2014 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ టైటిల్‌ సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలువడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. భారత్‌ తరఫున సుదీప్ చిర్మాకో (14వ నిమిషం) గోల్ చేయగా.. ఆసీస్‌ తరఫున జాక్ హాలండ్ 29వ నిమిషంలో  గోల్ చేశాడు. టైటిల్‌ నెగ్గిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. భారత్‌.. 2013, 2014ల్లో ఈ ట్రోఫీ నెగ్గింది. 

Advertisement
Advertisement