
భారత వెటరన్ షట్లర్ పారుపల్లి కశ్యప్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కామన్వెల్త్గేమ్స్ మాజీ చాంపియన్ అయిన ఈ తెలుగుతేజం గత నెలలో హైదరాబాద్లో జరిగిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో కాలి పిక్క కండరాల గాయానికి గురయ్యాడు. దీని నుంచి కోలుకునేందుకు 35 ఏళ్ల కశ్యప్కు కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. తిరిగి మళ్లీ అతను మార్చిలో బరిలోకి దిగే అవకాశముంది.