IPL 2023: Shubman Gill becomes the youngest Orange Cap winner - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. తొలి ఆటగాడిగా

May 30 2023 4:22 PM | Updated on May 30 2023 4:34 PM

Shubman Gill becomes the youngest Orange Cap winner - Sakshi

ఐపీఎల్‌-2023కు సోమవారంతో శుభం కార్డు పడింది. ఈ ఏడాది సీజన్‌ ఛాంపియన్స్‌గా చెన్నైసూపర్‌ కింగ్స్‌ నిలిచింది. ధోని సారధ్యంలోని సీస్‌ఎస్‌కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న గుజరాత్‌ టైటాన్స్‌ కలనెరవలేదు.

ఈసారి గుజరాత్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్‌లో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ను క్యాప్‌ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ పేరిట ఉండేది. 

2021 సీజన్‌లో గైక్వాడ్‌ 24 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా సీజన్‌తో రుత్‌రాజ్‌ రికార్డును బ్రేక్‌చేశాడు. ఇక ఈ ఓవరాల్‌గా ఐపీఎల్‌-2023లో మరికొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అవి ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

నమోదైన రికార్డులు ఇవే..
ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా సీఎస్‌కే కెప్టెన్‌ ధోని రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి మొదలుకొని ధోని వరుసగా 16 సీజన్లు ఆడాడు. 226 మ్యాచ్‌ల్లో అతను కెప్టెన్‌గా చేశాడు. రోహిత్‌ శర్మ (243), దినేశ్‌ కార్తీక్‌ (242), విరాట్‌ కోహ్లి (237), రవీంద్ర జడేజా (226) టాప్‌–5లో ఉన్నారు.  

ఐపీఎల్‌–2023లో అత్యధిక సెంచరీలు(12) నమోదయ్యాయి.  గత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధికంగా 8 సెంచరీలు వచ్చాయి.  

గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 37 సార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత సీజన్‌లో 18 సార్లు 200 అంతకంటే ఎక్కువ  పరుగులు వచ్చాయి.  

564 ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందిన తుషార్‌ దేశ్‌పాండే నిలిచాడు. ఈ సీజన్‌లో తుషార్‌ 16 మ్యాచ్‌లు ఆడి 564 పరుగులు ఇచ్చి 21 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు ప్రసిధ్‌ కృష్ణ (551 పరుగులు; 2022 సీజన్‌) పేరిట ఉంది. 

ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఏడుసార్లు ఛేజింగ్‌ చేసిన జట్టు చాంపియన్‌గా అవతరించింది. తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజేతగా నిలిచింది.  

ఐపీఎల్‌ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ (2013, 2015, 2017, 2019, 2020) జట్టు పేరిట ఉన్న రికార్డును చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2010, 2011, 2018, 2021, 2023) సమం చేసింది.  

ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా ఒక్కసారీ ఆలౌట్‌ కాలేదు.  

 6 మొత్తం 16 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఆరుసార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి.
చదవండి: IPL 2023: చాంపియన్‌గా చెన్నై.. గిల్‌ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement