సాత్విక్‌–చిరాగ్‌ జోడీ కొత్త చరిత్ర | Satwik AND Chirag Win Historic Doubles Gold at Badminton Asia Championships | Sakshi
Sakshi News home page

Asia Badminton Championship: సాత్విక్‌–చిరాగ్‌ జోడీ కొత్త చరిత్ర

May 1 2023 7:35 AM | Updated on May 1 2023 7:38 AM

Satwik AND Chirag Win Historic Doubles Gold at Badminton Asia Championships - Sakshi

దుబాయ్‌: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్‌ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ భారత్‌ పసిడి లోటు తీర్చింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్‌ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్‌ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు.

67 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్‌ సాతి్వక్‌–చిరాగ్‌ ద్వయం 16–21, 21–17, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ ఒంగ్‌ యె సిన్‌–తియో ఈ యి (చైనీస్‌ తైపీ) జోడీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో పురుషుల డబుల్స్‌ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. 1971లో దీపూ ఘోష్‌–రమణ్‌ ఘోష్‌ ద్వయం భారత్‌కు కాంస్య పతకం అందించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement