badminton asia championship
-
సింధు శుభారంభం
నింగ్బో (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 21–15, 21–19తో ప్రపంచ 36వ ర్యాంకర్ ఎస్తర్ నురుమి వొర్డోయో (ఇండోనేసియా)పై గెలిచింది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్ల్లో విజృంభించిన సింధు... 19 ఏళ్ల ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–11తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. ఇతర మ్యాచ్ల్లో ఆకర్షి కశ్యప్, అనుపమ, మాళవిక ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. ఆకర్షి 13–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ హాన్ యూ (చైనా) చేతిలో... అనుపమ 13–21, 14–21తో ప్రపంచ 13వ ర్యాంకర్ రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో... మాళవిక 14–21, 8–21తో గావ్ ఫెంగ్ జై (చైనా) చేతిలో ఓడారు. ప్రిక్వార్టర్స్లో కిరణ్, ప్రియాన్షు... పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే పరాజయం పాలవగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. తొలి రౌండ్లో లక్ష్యసేన్ 18–21, 10–21తో లీ చయ్ హౌ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రణయ్ 16–21, 21–12, 11–21తో జూ గువాంగ్ లూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–8తో దిమిత్రి పనారిన్ (కజకిస్తాన్)పై, ప్రియాన్షు 20–22, 21–12, 21–10తో వాంగ్చరోయెన్ (థాయ్లాండ్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్లో ప్రియా–శ్రుతి మిశ్రా జోడీ 11–21, 13–21తో షూ యెన్ సంగ్–చైన్ హుయి యూ (చైనా) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ ద్వయం 21–3, 21–12తో మధుక దులంజన–లహిరు వీరసింఘే (శ్రీలంక) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించగా... పృథ్వీ–సాయి ప్రతీక్ జంట 19–21, 12–21తో చై సియాంగ్ చైవాంగ్ చీ లిన్ (చైనా) ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి ని్రష్కమించింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
దుబాయ్: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. 1965లో పురుషుల సింగిల్స్లో దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ భారత్ పసిడి లోటు తీర్చింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు. 67 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ సాతి్వక్–చిరాగ్ ద్వయం 16–21, 21–17, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జోడీని ఓడించి చాంపియన్గా అవతరించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. 1971లో దీపూ ఘోష్–రమణ్ ఘోష్ ద్వయం భారత్కు కాంస్య పతకం అందించింది. -
జూదగాడు... జగజ్జేత
సరిగ్గా మూడేళ్ల క్రితం జపాన్ బ్యాడ్మింటన్కు సంబంధించి కెంటో మొమోటా అతి పెద్ద హీరో. అప్పటికే అనేక పెద్ద విజయాలతో దూసుకొచ్చిన 20 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చాంపియన్షిప్లో కూడా సత్తా చాటి ఆ దేశం తరఫున సింగిల్స్లో పతకం (కాంస్యం) సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మరో ఏడాది తర్వాత జరిగే రియో ఒలింపిక్స్లో కూడా తమ దేశానికి పతకం అందించగలడని అందరూ అతనిపై ఆశలు పెంచుకున్నారు. అయితే కొన్ని నెలల్లోనే సీన్ మారిపోయింది. మొమోటా చేసిన తప్పు అతడికి ఒలింపిక్స్ అవకాశాలనే కాదు దేశంలో అభిమానులను కూడా దూరం చేసేసింది. జూదం ఆడి శిక్షకు గురైన అతను ఇప్పుడు ప్రపంచ వేదికపై విజేతగా నిలిచి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. సాక్షి క్రీడావిభాగం : 2016 ఏప్రిల్లో జపాన్ బ్యాడ్మిం టన్ సమాఖ్య నిషేధం విధించే నాటికి మొమోటా అనామకుడేమీ కాదు. ఆ సమయంలో వరల్డ్ నంబర్–2గా కొనసాగుతున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్లో కాం స్యం, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ విజేత, రెండు సూపర్ సిరీస్ ప్రీమియర్, మరో సూపర్ సిరీస్ టైటిల్స్వంటి ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు మరో రెండు గ్రాండ్ప్రి విజయాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అంతకుముందే వరల్డ్, ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో సాధించిన స్వర్ణ, కాంస్యాలు... జపాన్లో మొమోటా సూపర్ స్టార్గా మారేందుకు పునాది వేశాయి. అయితే ఆటగాడిగా ఈ ఘనతలన్నీ అతడిని కాపాడలేకపోయాయి. రియో ఒలింపిక్స్లో పతకం సాధిస్తాడనే నమ్మకం ఉన్నా సరే... అతని క్రమశిక్షణారాహిత్యానికి జపాన్ సమాఖ్య నిర్దాక్షిణ్యంగా శిక్ష విధించింది. క్యాసినోకు వెళ్లి... మరో జపాన్ సీనియర్ క్రీడాకారుడు కెనిచి టాగోతో స్నేహం మొమోటాకు చేటు చేసింది. అతనితో కలిసి బయటి సరదాలకు అలవాటు పడిన అతను వరుసగా జట్టు ప్రాక్టీస్ సెషన్లకు డుమ్మా కొట్టాడు. ఇతర ఆటగాళ్లపై ఇది ప్రతికూలం ప్రభావం చూపిస్తోందని ముందుగా హెచ్చరించిన సమాఖ్య, ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించి మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణలో మొమోటా అక్రమ క్యాసినోలకు వెళ్లి జూదమాడుతున్నట్లు తేలింది. జపాన్లో గ్యాంబ్లింగ్పై నిషేధం ఉంది. ఫెడరేషన్ విచారణలో తాను ఆరు సార్లు జూదశాలకు వెళ్లినట్లు, మొత్తం 5 లక్షల జపాన్ యెన్లు (రూ. 3 లక్షలు) పోగొట్టుకున్నట్లు అతను చెప్పాడు. మరోవైపు ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్న మొమోటాను తానే తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లానని, తనకు ఎలాంటి శిక్ష విధించినా సిద్ధం కానీ అతడిని మాత్రం క్షమించమని టాగో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అయితే జపాన్ క్రీడా మంత్రి మాత్రం ‘జూదమాడటం ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధం. అలాంటివాడికి ఒలింపిక్స్ ఆడే అర్హత లేదు’ అంటూ నిషేధం ప్రకటించడంతో మొమోటా కెరీర్ ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయింది. అతనిపై శిక్షను కూడా జపాన్ ఎంతో కొంత కాలానికే పరిమితం చేయకుండా ‘నిరవధిక నిషేధం’ అని ప్రకటించడం ఇబ్బందికరంగా మారింది. ఏడాది తర్వాత... ఒక వ్యక్తిగత క్రీడలో 22 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న సమయంలో ఈ తరహా ఎదురు దెబ్బ తినడం ఆ ఆటగాడిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుచూపు మేరలో ఎలాంటి భవిష్యత్తు కనిపించలేదు. అయితే ఏదోలా ధైర్యం చేసుకున్న కెంటో షటిల్ను మాత్రం వదలి పెట్టలేదు. దిగువ స్థాయి స్థానిక లీగ్లలో పాల్గొనడంతో పాటు ఎలాంటి వివాదానికి తావులేకుండా తన ఆటను కొనసాగించాడు. మరోవైపు శిక్షలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. దాంతో అతని ప్రవర్తనపై సంతృప్తి చెందిన జపాన్ ఫెడరేషన్ ఊహించని బహుమతిని అందించింది. గత ఏడాది మార్చిలో మొమోటా నిషేధం మే 15తో ముగుస్తుందని ప్రకటించింది. అంతే... ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన ఈ జపాన్ స్టార్ దూసుకుపోయాడు. ర్యాంకింగ్ 250 దాటిపోవడంతో చిన్న టోర్నీలు, క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడుతూనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు వరల్డ్ చాంపియన్గా నిలవడం అద్భుతం. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో అతను ఓడించిన ఆటగాళ్ళలో లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా), విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), కిడాంబి శ్రీకాంత్ (భారత్), టామీ సుగియార్తో (ఇండోనేసియా), సన్ వాన్ హో (దక్షిణ కొరియా), షి యుకి (చైనా)లాంటి టాప్ షట్లర్లు ఉన్నారు. పునరాగమనం తర్వాత అతను ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం, సూపర్–1000 టోర్నీ ఇండోనేసియా ఓపెన్ను కూడా గెలుచుకున్నాడు. కెరీర్లో అనూహ్య మలుపుల తర్వాత జగజ్జేతగా నిలిచిన మొమోటా, ఇక సొంతగడ్డపై 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధిస్తేనే తన కెరీర్కు సార్థకత అని ప్రకటించడం విశేషం. కెంటో మొమోటా ప్రొఫైల్ పుట్టిన తేదీ: సెప్టెంబర్ 1, 1994 ఎత్తు: 5 అడుగుల 9 అంగుళాలు బరువు: 68 కేజీలు; ఆడే శైలి: ఎడమచేతి వాటం ప్రస్తుత ర్యాంక్: 7; అత్యుత్తమ ర్యాంక్: 2 (ఏప్రిల్, 2016) ఈ ఏడాది గెలిచిన సింగిల్స్ మ్యాచ్లు: 33 కెరీర్లో నెగ్గిన సింగిల్స్ మ్యాచ్లు: 222 -
రెండో రౌండ్లో ప్రవేశించిన కశ్యప్
వుహాన్ (చైనా): భారత బ్యాడ్మింటన్ తేజం పారుపల్లి కశ్యప్ ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై ప్రపంచ 14వ ర్యాంకర్ కశ్యప్ గెలుపొందాడు. మరోవైపు ఆసియా బ్యాడ్మింటన్ తొలి రౌండ్లోనే జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పలు ఓటమి చెందారు. -
పోరాడి ఓడిన పీవీ సింధు
ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్లో భారత పోరు ముగిసింది. సింగిల్స్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ గుత్తా జ్వాల - అశ్వినీ పొన్నప్ప కూడా చైనా క్రీడాకారిణులతో జరిగిన సెమీస్లో ఓడిపోయారు. దీంతో 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ ఉన్న ఈ టోర్నమెంటులో్ కాంస్యపతకాలతోనే వారు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటా 18 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన మారథాన్ మ్యాచ్లో వరల్డ్ నెం.2 క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ను సింధు 21-15 స్కోరుతో గెలుచుకుని ఆశలు రేకెత్తించింది. అయితే, రెండో గేమ్ను షిసియాన్ 22-20తో గెలుచుకుంది. మూడో గేమ్లో షిసియాన్ పూర్తి ఆధిక్యం కనబరిచింది. 21-12 తేడాతో సింధును ఓడించింది. వీళ్లిద్దరు ఇప్పటికి ఐదుసార్లు ముఖాముఖి తలపడగా సింధు మూడుసార్లు, షిసియాన్ రెండు సార్లు గెలిచారు. ఇక డబుల్స్ మ్యాచ్ మాత్రం కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిపోయింది. లూ యింగ్, లూ యు జోడీ చేతిలో జ్వాల - అశ్విని జోడీ 21-12, 21-7 తేడాతో ఓడిపోయారు.