
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో భారత్తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.
ఇంగ్లండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..
👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*
👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575
👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376
👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196
👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152
👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134
ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..
తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.
చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా