లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌ | India-A Vs Sri Lanka-A Final Match In Tri-series Dambulla | Sakshi
Sakshi News home page

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

Jun 21 2026 9:38 AM | Updated on Jun 21 2026 11:22 AM

India-A Vs Sri Lanka-A Final Match In Tri-series Dambulla

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ట్రై సిరీస్ ఆఖ‌రి ఘ‌ట్టానికి చేరుకుంది. ముక్కోణ‌పు వ‌న్డే టోర్నీ ఫైన‌ల్‌లో శ్రీలంక‌-ఏ, ఇండియా-ఏ జ‌ట్టు త‌ల‌ప‌ డుతున్నాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది.  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్‌ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ  మార్క్‌ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్‌) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును వైభవ్‌ బద్దలుకొట్టాడు.

తుది జట్లు:
ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్

శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement