IPL 2022: India U19 World Cup Winning Players Added To IPL 2022 Auction Register - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: షేక్‌ రషీద్‌ సహా మిగతా ఆటగాళ్లకు లైన్‌ క్లియర్‌

Feb 12 2022 10:34 AM | Updated on Feb 12 2022 11:18 AM

India U19 World Cup 2022 Winning Players Added IPL 2022 Auction Register - Sakshi

ఐపీఎల్‌ మెగావేలం ప్రారంభానికి ముందు అండర్‌-19 ఆటగాళ్లకు ఊరట లభించింది. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన యంగ్‌ ఇండియా జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు వేలంలో పేరును రిజిస్టర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, షేక్ రషీద్, విక్కీ ఒస్త్వాల్‌, రాజ్‌ బవా, రాజ్‌వర్దన్‌ హంగ్‌కర్కర్‌, దినేష్ బానా, రవి కుమార్, నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్, అంగ్క్రిష్ రఘువంశీలు ఈ లిస్టులో ఉన్నారు.

కాగా నాలుగు రోజుల క్రితం కనీసం 19 ఏళ్ల ఏజ్‌‌  లిమిట్‌‌, స్టేట్‌‌ సీనియర్‌‌ టీమ్‌‌కు ఒక మ్యాచ్‌‌ అయినా ఆడి ఉండాలని బీసీసీఐ నిబంధన తెచ్చింది. దీంతో యశ్‌ ధుల్‌ మినహా మిగతా ఆటగాళ్లు వేలానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇలాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్‌ వేలంలో అవకాశం కల్పిస్తే బాగుంటుందని మెజారిటీ వర్గం అభిప్రాయపడింది. దీంతో బీసీసీఐ కూడా అండర్‌-19 ఆటగాళ్లకు వేలంలో పాల్గొనేందుకు వేలానికి ఒక్కరోజు ముందు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా 10 మంది అండర్‌-19 ఆటగాళ్లకు లైన్‌ క్లియర్‌ కావడంతో ఆక్షన్‌‌లో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 600కు పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement