IND vs SL: అర్ష్‌దీప్‌ సింగ్‌ అత్యంత చెత్త రికార్డు.. తొలి భారత బౌలర్‌గా!

IND vs SL: Arshdeep Singh Creates Unwanted Record - Sakshi

పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్ష్‌దీప్‌ ఏకంగా 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. పరుగులు విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ ఏకంగా 5 నోబాల్స్‌ వేశాడు.

దీంతో పలు చెత్త రికార్డులను అర్ష్‌దీప్‌ తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ వరుసగా హ్యాట్రిక్‌ నోబాల్స్‌ వేశాడు. తద్వారా భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ నోబాల్స్‌ వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్‌ వేసిన తొలి భారత బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్‌ చెత్త రికార్డు నెలకొల్పాడు. 
చదవండి: IND vs SL: భారత్‌ చెత్త బౌలింగ్‌.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు! టార్గెంట్‌ ఎంతంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top