IND Vs SL 3rd ODI: Team India Won Toss Elected To Bat, SKY Into Final Eleven - Sakshi
Sakshi News home page

IND VS SL 3rd ODI: తొలుత బ్యాటింగ్‌ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?

Jan 15 2023 1:24 PM | Updated on Jan 15 2023 2:28 PM

IND VS SL 3rd ODI: Team India Won Toss Elected To Bat, SKY Into Final Eleven - Sakshi

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి, తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. హార్ధిక్‌ పాం‍డ్యా, ఉమ్రాన్‌ మాలిక్‌లకు రెస్ట్‌ ఇచ్చిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు అవకాశం ‍కల్పించిం‍ది. మరోవైపు శ్రీలంక  సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆషేన్‌ బండార, జెఫ్రీ వాండర్సే తుది జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

తుది జట్లు..

భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ఆషేన్‌ బండార, జెఫ్రీ వాండర్సే, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, కసున్ రజిత 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement