గాలే వేదికగా శ్రీలంక-ఎతో జరుగుతున్న రెండో అనాధికర టెస్ట్ తొలి రోజులో భారత-ఎ బౌలర్లు విఫలమయ్యారు. గాలే వంటి ఫ్లాట్ వికెట్పై బౌలింగ్ చేయడం ఇండియా పేసర్లకు కఠిన సవాల్గా మారింది. తొలి అనాధికరిక టెస్ట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
అతడు తీవ్రంగా శ్రమించినప్పటికి తొలి రోజు ఆటలో కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
లంక బ్యాటర్లలో సహన్ అరచ్చిగే(83 నాటౌట్) క్రీజులో ఉండగా.. అంజల బండార(42), నువనిదు ఫెర్నాండో(44) రాణించారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సారాన్ష్ జైన్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ సాధించాడు.
తుది జట్లు
శ్రీలంక-ఎ: పవంత వీరసింగ్, సోహన్ డి లివెరా, నువానీదు ఫెర్నాండో, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే(కెప్టెన్), అంజల బండార(వికెట్ కీపర్), చమిక గుణశేఖర, దిలుమ్ సుదీర, కేశర నువంత, దులజ్ సముదిత, అసంక మనోజ్
ఇండియా-ఎ: సాయి సుదర్శన్, అమన్ మొఖడే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షేక్ రషీద్, సరాంశ్ జైన్, జీషన్ అన్సారీ, ఔకిబ్ నబీ దార్, యశ్ ఠాకూర్, గుర్నూర్ బ్రార్


