టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా | Women’s ODI World Cup 2025: India vs South Africa Playing XI Announced for Vizag Clash | Sakshi
Sakshi News home page

టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

Oct 9 2025 3:42 PM | Updated on Oct 9 2025 3:50 PM

ICC Womens Cwc 2025 IND vs SA: South Africa Women opt to bowl, Playing 11 details

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2025లో భాగంగా వైజాగ్ వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ గంట నిమిషాల ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది.

పేసర్‌ రేణుకా సింగ్‌ స్ధానంలో ఆల్‌రౌండర్‌ అమన్‌ జ్యోత్‌ కౌర్‌ తుది జట్టులోకి వచ్చింది. సౌతాఫ్రికా జట్టులో కూడా ఓ మార్పు చోటు చేసుకుంది. మసాబాటా క్లాస్ స్దానంలో తుమీ సెఖుఖునేకి చోటు దక్కింది. భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా.. సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్‌లో గెలిపొందింది.

తుది జ‌ట్లు
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

దక్షిణాఫ్రికా మహిళల జ‌ట్టు ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్‌), తజ్మిన్ బ్రిట్స్, సునే లూయస్, మారిజానే కాప్, అన్నెకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీప‌ర్‌), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, తుమీ సెఖుఖునే, మ్లాబా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement