
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్ను పరాజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.
ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకుంటే.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలొగ్గింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంత్ సేన చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. లక్ష్య ఛేదనలో భాగంగా ముంబై నాయకత్వ బృందం తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.
విజయానికి ఇరవై నాలుగు పరుగుల దూరంలో ఉన్న సమయంలో బ్యాటర్ తిలక్ వర్మ ( Tilak Varma- 23 బంతుల్లో 25)ను రిటైర్డ్ అవుట్గా వెనక్కి పిలిపించారు. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు జతగా బౌలింగ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.
Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯
Only the 4th time a batter has retired out in the IPL!
Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025
పరుగు తీసేందుకు నిరాకరణ
ఇక ఆఖరి ఓవర్లో ముంబై గెలుపునకు 22 పరుగులు అవసరమైన సమయంలో .. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో హార్దిక్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. దీంతో ముంబై శిబిరంలో జోష్ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు ఈ పేస్ బౌలర్. అయితే, మూడో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా పాండ్యా మాత్రం అందుకు నిరాకరించాడు.
ఈ క్రమంలో మూడో బంతికి ముంబై పరుగులేమీ రాబట్టలేకపోగా.. నాలుగో బంతి కూడా డాట్ అయింది. అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారు కాగా.. ఐదో బంతికి హార్దిక్ సింగిల్ తీసి.. సాంట్నర్ను క్రీజులోకి పంపాడు. ఆఖరి బంతికి సాంట్నర్ పరుగులేమీ రాబట్టలేదు. ఫలితంగా పన్నెండు పరుగుల తేడాతో ముంబైకి పరాజయం తప్పలేదు.
ఆకాశ్ అంబానీ ఆగ్రహం
అయితే, తిలక్ వర్మను కాదని ‘హిట్టింగ్’ కోసమని సాంట్నర్ను పంపిన ముంబై వ్యూహం బెడిసికొట్టగా.. సాంట్నర్కు స్ట్రైక్ ఇచ్చేందుకు హార్దిక్ నిరాకరించడం జట్టు యజమాని ఆకాశ్ అంబానీకి కోపం తెప్పించింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి హార్దిక్ చేసిన పనికి ఆకాశ్ ఇచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది.
మరోవైపు.. ఆఖరి ఓవర్ ఐదో బంతికి లక్నో విజయం దాదాపు ఖరారు కాగా.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చప్పట్లు కొడుతూ అతడు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. మరోవైపు ఆకాశ్ మాత్రం తమ సభ్యులతో సీరియస్గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్-2025:లక్నో వర్సెస్ ముంబై
లక్నో స్కోరు: 203/8 (20)
ముంబై స్కోరు: 191/5 (20)
ఫలితం: 12 పరుగుల తేడాతో ముంబైపై లక్నో గెలుపు.
చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం: హార్దిక్
MI Owner Akash Ambani reaction When Hardik Pandya on 19.3 Balls not takes the Single.#LSGvsMI pic.twitter.com/BCznQ7fc5J
— Vikas Yadav (@VikasYadav69014) April 4, 2025