England opt to bat against Australia in first Ashes Test - Sakshi
Sakshi News home page

Ashes 2023: యాషెస్‌ తొలి టెస్టు ప్రారంభం..తుది జట్లు ఇవే! స్టార్‌ బౌలర్‌ దూరం

Jun 16 2023 3:30 PM | Updated on Jun 16 2023 4:38 PM

England opt to bat in first Ashes Test - Sakshi

క్రికెట్‌లో భారత్‌-పాకిస్తాన్‌ తర్వాత అత్యుత్తమ సమరంగా భావించే యాషెస్‌ సిరీస్‌ శుక్రవారం(జూలై16) ప్రారంభమైంది.  ఈ చారిత్రాత్మక సిరీస్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదటి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

గతంలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అలీ.. యాషెస్‌ సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ స్ధానంలో అలీకి చోటు దక్కింది. ఇక తొలి టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్‌ మిచిల్‌ స్టార్క్‌ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పేసర్‌ హాజిల్‌వుడ్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్

ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), మోయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement